మరోసారి సత్తిబాబు సంచలన వ్యాఖ్యలు

రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. నిపుణుల కమిటీ అభిప్రాయం మేరకే రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తామని చెప్పారు. నివేదిక పూర్తి [more]

Update: 2019-10-23 13:44 GMT

రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. నిపుణుల కమిటీ అభిప్రాయం మేరకే రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తామని చెప్పారు. నివేదిక పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే రాజధాని ఎక్కడ ఉండాలో చెబుతామన్నారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో దోపిడీ చేసిందన్నారు. ఐదేళ్లలో రాజధానిని ఎందుకు నిర్మించలేక పోయారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. లక్షల కోట్లు అప్పులు చేసి రాష‌్ట్ర విభజన కంటే ఎక్కువ అన్యాయం చేసింది టీడీపీయేనని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రజలు చిత్తుగా ఓ‌డించిన తర్వాత కూడా చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

Tags:    

Similar News