మా పార్టీది సింగిల్ లైన్

రాజధాని అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ ది సింగిల్ లైన్ అని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తమ పార్టీ రాజధాని అమరావతిలోనే కొనసాగాలని భావిస్తుందన్నారు. [more]

Update: 2019-12-25 07:48 GMT

రాజధాని అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ ది సింగిల్ లైన్ అని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తమ పార్టీ రాజధాని అమరావతిలోనే కొనసాగాలని భావిస్తుందన్నారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తుందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని టీడీపీ కోరుకుంటుందని, అయితే రాజధాని అమరావతిలోనే కొనసాగాలని కూడా కోరుకుంటున్నామని బోండా ఉమ తెలిపారు. అయితే విశాఖ టీడీపీ నాయకులు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఎందుకు తీర్మానం చేశారో తమకు తెలియదన్నారు. స్థానిక సమస్యల వల్లనే వారు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని బోండా ఉమ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News