ఈ నెల 28 నుంచి బండి పాదయాత్ర

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఈ నెల 28వ తేదీ నుంచి జరిగే అవకాశముంది. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ [more]

Update: 2021-08-23 02:07 GMT

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఈ నెల 28వ తేదీ నుంచి జరిగే అవకాశముంది. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతితో 24వ తేదీ వరకూ బీజేపీ దేశ వ్యాప్తంగా సంతాప దినాలను పాటిస్తుంది. దీంతో ఈ నెల 24 వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన బండి సంజయ్ పాదయాత్ర ఈ నెల 28వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. 28వ తేదీన హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.

Tags:    

Similar News