ఏపీ మంత్రి కాన్వాయ్ కు ప్రమాదం.. ఒకరి మృతి

ఔటర్ రింగ్ రోడ్ లోని కోహెడ ప్రాంతాల్లో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ లో ఉన్న కారు అదుపు తప్పింది.. ఈ ప్రమాదంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ [more]

Update: 2020-07-07 07:12 GMT

ఔటర్ రింగ్ రోడ్ లోని కోహెడ ప్రాంతాల్లో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ లో ఉన్న కారు అదుపు తప్పింది.. ఈ ప్రమాదంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ పాపయ్య అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురు కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. మంత్రి వెనకాల ఉన్న కారు టైరు పగిలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అదుపుతప్పిన కారు అవతలి రోడ్డు వైపునకు వెళ్లి పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ పాపయ్య అక్కడికక్కడే చనిపోయాడు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లను పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలి నుంచి విజయవాడకు అవుటర్ రింగ్ రోడ్డు లో వెళుతున్న టైమ్ లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కారు వెనుక ఉన్న కాన్వాయ్ కారు అదుపు తప్పింది. క్షతాగ్రులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News