బ్రేకింగ్ : శ్రీనివాసరావు బెయిల్ పిటీషన్ దాఖలు

Update: 2018-11-05 06:54 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తరపున కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలైంది. సలీం అనే ఓ అడ్వకేటు స్వచ్ఛందంగా బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో పాటు శ్రీనివాసరావు ఆరోగ్యంపై మరో పిటీషన్ కూడా వేశారు. అంతకుముంద సలీం.. జైల్లో శ్రీనివాసరావును కలిశారు. అతడి కోరిక మేరకే అడ్వకేట్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక విచారణ మరింత లోతుగా జరిపేందుకు గానూ శ్రీనివాసరావును మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరురోజుల పాటు అతడిని విచారించారు. శ్రీనివాసరావుతో ఫోన్ లో మాట్లాడిన 321 మందిని కూడా విచారించి వారి స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. అయితే, ఘటనకు పాల్పడటానిక అసలు కారణం ఇంకా తేలకపోవడంతో మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారించే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News