విశాఖను విజయసాయి ఆక్రమించుకుంటున్నాడు

వైసీపీ ప్రభుత్వం పనితీరుపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. ప్రజల ఆస్తిని ప్రభుత్వం తాకట్టు పెడుతుందని ఆయన ఆరోపించారు. డబ్బుల కోసం శాశ్వతంగా ప్రజల [more]

Update: 2021-06-12 06:46 GMT

వైసీపీ ప్రభుత్వం పనితీరుపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. ప్రజల ఆస్తిని ప్రభుత్వం తాకట్టు పెడుతుందని ఆయన ఆరోపించారు. డబ్బుల కోసం శాశ్వతంగా ప్రజల ఆస్తిగా ఉండే ప్రభుత్వ భూములను ప్రభుత్వం తాకట్టు పెడుతుందని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. విశాఖపట్నంలో 213 ఎకరాల ప్రభుత్వ భూమిని 1600 కోట్లకు తాకట్టు పెడుతున్నారని అయ్యన్న పాత్రుడు తెలిపారు. విశాఖపట్నాన్ని విజయసాయిరెడ్డి ఆక్రమించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేదని, ఆదాయం పెంచుకోవడానికి భూములను తాకట్టు పెడుతున్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు.

Tags:    

Similar News