వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోతున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజ్యాంగ పరిస్థితులపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. పోలీసులు, సీఐడీ, ఏసీబీలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం [more]

Update: 2021-05-16 01:33 GMT

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజ్యాంగ పరిస్థితులపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. పోలీసులు, సీఐడీ, ఏసీబీలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. జగన్ సైకోచేష్టలతో అన్ని వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. ఎంపీని స్పీకర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడమేంటని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. న్యాయస్థానాలు, గవర్నర్ చెప్పినా ముఖ్యమంత్రి పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగా జగన్ ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా ఆయన పట్టించుకోలేదన్న విషయాన్ని అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు.

Tags:    

Similar News