మంచి రోజులు ముందున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ లు ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో పొట్టి శ్రీరాములు కుటుంబసభ్యులతో పాటు స్వాతంత్ర [more]

Update: 2019-11-01 13:23 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ లు ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో పొట్టి శ్రీరాములు కుటుంబసభ్యులతో పాటు స్వాతంత్ర సమరయోధులను జగన్ సన్మానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ మన కష్టమంతా మద్రాస్, హైదరాబాద్ లోనే ఉండిపోయిందన్నారు. అయితే కొత్త రాష్ట్రంలో ఎప్పుడూ సమస్యలు ఉంటాయని, వాటిని అధిగమిస్తూ ఐక్యంగా ముందడుగు వేయాలని కోరారు. వెనుకబాటుతనం, నిరక్షరాస్యతను నిర్మూలిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్ని సమస్యలున్నా ప్రభుత్వం వెనకడుగు వేయబోమన్నారు. మంచి రోజులు ముందున్నాయని జగన్ చెప్పారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకునేందుకే ఈ అవతరణ దినోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. పాలనలో నవరత్నాలతో ముందుకు వెళతామని చెప్పారు.

Tags:    

Similar News