ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా.. సోమవారం సాయంత్రం

Update: 2022-01-03 11:55 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా.. సోమవారం సాయంత్రం సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన ప్రధానితో చర్చించనున్నారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం జగన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవ్వనున్నారు. మంగళవారం ఉదయం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. కాగా.. తొలుత సీఎం జగన్ ఢిల్లీ చేరుకోగా వైసీపీ ఎంపీలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.


Tags:    

Similar News