రాజధానిపై మరో కమిటీ కూడా?

రాజధాని అమరావతిపై జగన్ ప్రభుత్వం నియమించిన మరో కమిటీ బోస్టన్ కన్సల్టింగ్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఇందులో [more]

Update: 2019-12-21 06:46 GMT

రాజధాని అమరావతిపై జగన్ ప్రభుత్వం నియమించిన మరో కమిటీ బోస్టన్ కన్సల్టింగ్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఇందులో గ్రీన్ ఫీల్డ్ రాజధాని కంటే బ్రౌన్ ఫీల్డ్ రాజధాని అయితేనే వేగంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ బోస్టన్ కమిటీ కూడా ఈ నెలాఖరుకకు పూర్తి స్థాయి నివేదికను జగన్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ ఫీల్డ్ ఉన్న అమరావతి కంటే విశాఖపట్నం వైపే ఈ కమిటీ కూడా మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత జనవరి మొదటి వారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఫైనల్ నిర్ణయం జగన్ రాజధాని అమరావతిపై ప్రకటిస్తారంటున్నారు.

Tags:    

Similar News