విశాఖలో మరో ప్రమాదం..భారీ పేలుడుతో

విశాఖపట్నంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ ఫార్మాసిటీలోని రాంకీ ఫార్మాసిటీలోని సాల్వెంట్ కంపెనీలో పెద్దయెత్తున పేలుడు సంభవించింది. పన్నెండుసార్లు పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుుతన్నారు. దీంతో [more]

Update: 2020-07-14 02:05 GMT

విశాఖపట్నంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ ఫార్మాసిటీలోని రాంకీ ఫార్మాసిటీలోని సాల్వెంట్ కంపెనీలో పెద్దయెత్తున పేలుడు సంభవించింది. పన్నెండుసార్లు పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుుతన్నారు. దీంతో విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సంభవించిన ప్రాంతం నుంచి దాదాపు 12 కిలోమేటర్ల మేర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విశాఖలో వరస ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

Tags:    

Similar News