ధైర్యం చెప్పకుండా భయపెడుతున్నారు

ఏపీ ప్రజల్లో చంద్రబాబు ధైర్యాన్ని నింపకుండా ప్రతి రోజూ పొరుగు రాష్ట్రం నుంచి భయపెడుతున్నారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. ఆయనకు ప్రభుత్వంపై మాట్లాడే నైతిక [more]

Update: 2020-04-28 08:05 GMT

ఏపీ ప్రజల్లో చంద్రబాబు ధైర్యాన్ని నింపకుండా ప్రతి రోజూ పొరుగు రాష్ట్రం నుంచి భయపెడుతున్నారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. ఆయనకు ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కరోనా తో అప్రమత్తంగా ఉండాలని, దానితో భవిష్యత్తులో కలసి జీవించాలని జగన్ చెబుతుంటే, చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రజలను భయపెట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అత్యధిక టెస్ట్ లు చేస్తున్న విషయం చంద్రబాబు మర్చిపోయినట్లుందని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఇళ్లల్లో కూర్చుని దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News