ముగిసిన కేబినెట్ సమావేశం… అసెంబ్లీ సమావేశాలు?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. 16 నుంచి అసెంబ్లీ సమావేశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భోగాపురం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు పూర్తి చేయడానికి మంత్రి వర్గ సమావేశం [more]

Update: 2020-06-11 08:24 GMT

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. 16 నుంచి అసెంబ్లీ సమావేశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భోగాపురం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు పూర్తి చేయడానికి మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఐదు దశల్లో రామాయపట్నం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. మొదటి దశలో రామాయపట్నం పోర్ట్ కు 4,736 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. రామాయపట్నం పోర్టుకు విభజన హామీల్లో భాగంగా కేంద్ర నిధులు ఇవ్వాలని మంత్రి వర్గం అభిప్రాయపడింది. ఆగస్టు నాటికి రామాయపట్నం పోర్టుకు టెండర్లు పిలవాలని మంత్రి వర్గం నిర్ణయించింది. కేంద్రం నుంచి నిధులను సాధిస్తూనే ముందుకు వెళ్లాలని మంత్రి వర్గం అభిప్రాయపడింది. వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News