టీడీపీని రద్దు చేసేందుకే చంద్రబాబు నిర్ణయం

టీడీపీని మూసివేసేందుకే చంద్రబాబు నిర్ణయించుకున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారన్నారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు [more]

Update: 2021-04-03 01:03 GMT

టీడీపీని మూసివేసేందుకే చంద్రబాబు నిర్ణయించుకున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారన్నారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాబోరన్నారు. మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను తిరిగి నిర్వహిస్తే తప్పేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారన్నారు. చంద్రబాబు ఏనాడూ ఒంటరిగా అధికారంలోకి రాలేదని అంబటి రాంబాబు గుర్తు చేశారు. చంద్రబాబు త్వరలో పార్టీని కూడా రద్దు చేస్తారని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.

Tags:    

Similar News