బాబూ ముందు అభ్యర్థులను నిలబెట్టండి

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు హయాంలోనే టీడీపీ దుకాణం బంద్ అవుతుందని అంబటి రాంబాబు [more]

Update: 2021-03-31 01:10 GMT

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు హయాంలోనే టీడీపీ దుకాణం బంద్ అవుతుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అసలు ఎన్టీఆర్ వారసులు పార్టీని పట్టించుకోక పోవడం వల్లనే పార్టీకి ఈ పరిస్థితి దాపురించిందని అంబటి రాంబాబు చెప్పారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని ఆయన ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. తాము ప్రత్యేక హోదాను సాధించి తీరతామని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News