వైసీపీలో ఆపరేషన్ ఆమంచి అట

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి త్వరలో వైసీపీలో చేరేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. జగన్ కు భయపడే [more]

Update: 2019-09-15 07:30 GMT

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి త్వరలో వైసీపీలో చేరేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. జగన్ కు భయపడే కాపు నేతలు ఆయన వెంట వెళుతున్నారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఆమంచి కృష్ణమోహన్ ఖండించారు. అన్ని వర్గాలూ జగన్ సమర్థతను, పాలనాదక్షతను గుర్తించాయన్నారు. చంద్రబాబుపై ఆయన పార్టీ నేతలకే నమ్మకం లేదన్నారు. త్వరలోనే అనేక మంది నేతలు వైసీపీలో చేరబోతున్నారని తెలిపారు. మరో మూడు నెలల్లో మీరే చూస్తారని ఆమంచి తెలిపారు. అయితే ఆపరేషన్ ఆమంచి స్టార్టయిందా? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన జగన్ సమర్థతను చూసే కులాలకు అతీతంగా చేరుతున్నారన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఆపరేషన్ ఆమంచి మాటేమోగాని భవిష్యత్తులో తెలుగుదేశం పాార్టీ కనుమరుగవుతుందని తెలిపారు.

Tags:    

Similar News