టెన్త్, ఇంటర్ పరీక్షలు యధాతధం

ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జగన్ మరోసారి సమీక్ష జరిపిన అనంతరం దీనిపై [more]

Update: 2021-04-15 02:06 GMT

ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జగన్ మరోసారి సమీక్ష జరిపిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని సురేష్ వెల్లడించారు. పాఠశాలల్లో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సురేష్ తెలిపారు. ప్రతి రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్ లో కోవిడ్ కేసులు పెరగితే అప్పుడు టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని సురేష్ తెలిపారు. ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు సురేష్ తెలిపారు.

Tags:    

Similar News