బ్రేకింగ్ : ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జులై 31వ తేదీలోగా ఫలితాలను ప్రకటించడం సాధ్యం కాదు [more]

Update: 2021-06-24 13:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జులై 31వ తేదీలోగా ఫలితాలను ప్రకటించడం సాధ్యం కాదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేష్ తెలిపారు. రద్దు చేసిన పరీక్షల కు సంబంధించి విద్యార్థులకు మార్కులను ఎలా కేటాయించాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇందుకోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రేపు సుప్రీంకోర్టులో తీర్పు ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు రద్దు చేయడం గమనార్హం.

Tags:    

Similar News