బ్రేకింగ్ ; అచ్చెన్నాయుడు డిశ్చార్జ్.. విజయవాడ జైలుకు

మాజీ మంత్రి అచ్చెన్నాయడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నందున డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స [more]

Update: 2020-07-01 12:54 GMT

మాజీ మంత్రి అచ్చెన్నాయడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నందున డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలను ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయనకు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ కావడంతో ఆయనను విజయవాడ ఆసుపత్రికి పోలీసులు తరలించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఏసీబీ కోర్టులో అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ పై విచారణ ముగిసింది. తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. ఈనెల 3వ తేదీన తీర్పు వెలువడే అవకాశముంది.

Tags:    

Similar News