Vijayawada : దుర్గమ్మ గుడి పై విషాదం

విజయవాడ దుర్గమ్మ గుడిపై విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక కార్మికుడు మృతి చెందారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో టెంట్ హౌస్ [more]

Update: 2021-10-06 02:47 GMT

విజయవాడ దుర్గమ్మ గుడిపై విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక కార్మికుడు మృతి చెందారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో టెంట్ హౌస్ కార్మికుడు బంటు సతీష్ మృతి చెందాడు. ఈ తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్యూలెన్లకు సంబంధించిన సామాన్లు తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News