యూపీలో ఘోర ప్రమాదం .. 20 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తాపడి ఇరవై మంది మరణించారు.

Update: 2022-08-11 12:09 GMT

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తాపడి ఇరవై మంది మరణించారు. ప్రమాద సమయంలో పడవలో ముప్ఫయి నుంచి యాభై మంది ప్రయాణికులు ఉన్నారు. బరువు ఎక్కువ కావడంతో పడవ బోల్తా పడింది. బాందా దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బందా ఘాట్ నుంచి ఫతేపూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంతా రాఖీ పండగ కోసం సొంత ఊళ్లకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు సమాచారం.

గాలింపు చర్యలు...
యమునా నదిలో పడవ పూర్తిగా మునిగిపోయింది. యాభై మంది గల్లంతయినట్లు సమాచారం. అయితే రెస్క్యూ టీం చాలా మందిని రక్షించారు. మర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాలింపు చర్యలను ముమ్మరంగా చేపట్టారు.


Tags:    

Similar News