బ్రేకింగ్ : 19 మంది ఎమ్మెల్యేల రాజీనామా

ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేసిన వెంటనే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన [more]

Update: 2020-03-10 07:57 GMT

ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేసిన వెంటనే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉండటం విశేషం. వీరంతా జ్యోతిరాదిత్య సింధియా వర్గం. దీంతో కమల్ నాధ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనే చెప్పాలి. ఈరోజు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం భోపాల్ లో జరగనుంది. ఈ సమావేశంలోనే శివరాజ్ సింగ్ చౌహాన్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. వీరి రాజీనామాలతో బీజేపీ బలం పెరిగినట్లయింది.

Tags:    

Similar News