బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారు

మునుగోడు ఉప ఎన్నికల్లో విజయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు

Update: 2022-11-07 07:43 GMT

మునుగోడు ఉప ఎన్నికల్లో విజయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇన్నాళ్లు అవాకులు, చవాకులు పేలిన వారి నోళ్లు మూత బడ్డాయని కవిత అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం చెప్పారని కవిత అన్నారు.

హ్యాట్రిక్ విజయాలను...
నల్లగొండ జిల్లాలో హ్యాట్రిక్ విజయాలను సాధించామని తెలిపారు. ఇక ఏ ఎన్నిక జరిగినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉంటారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఆ పార్టీని గెలిపిస్తాయని తెలిపారు. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో యాభై లక్షలతో స్వామి వారికి రథాన్ని ఏర్పాటు చేయిస్తానని కవిత హామీ ఇచ్చారు.


Tags:    

Similar News