డిప్యూటీ సీఎం ఇంట విషాదం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు మృతి చెందారు

Update: 2024-02-13 04:04 GMT

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు మృతి చెందారు. ఆయన కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏఎంజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మల్లు వెంకటేశ్వర్లు వయసు 70 సంవత్సరాలు. ఆయన ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు.

ఏఎంజీ లో చికిత్స పొందుతూ...
వైరాలో ఉంటున్నారు. మూడు నెలలుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని బంధువులు తెలిపారు. మూడు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఈరోజు ఉదయం మరణించారు. సోదరుడు మరణవార్త తెలిసిన వెంటనే మల్లు భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం బయలుదేరి వెళ్లారు.


Tags:    

Similar News