నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రాంరంభం కానున్నాయి.

Update: 2022-03-05 01:49 GMT

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రాంరంభం కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 14వ వరకూ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో యాదాద్రి లో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. దాదాపు 11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. తెలంగాణ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై తమ మొక్కులు తీర్చుకుంటారు.

11 రోజుల పాటు....
ఈ 11 రోజుల పాటు యాదాద్రి ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని వేద పండితులు చెబుతారు. ఈ బ్రహ్మోత్సవాలు 1955 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఎంతమంది వచ్చినా వారికి వసతి సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.


Tags:    

Similar News