నేడు పదో తరగతి ఫలితాలు

నేడు పదోతరగతి ఫలితాలు తెలంగాణలో విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు

Update: 2023-05-10 02:47 GMT

నేడు పదోతరగతి ఫలితాలు తెలంగాణలో విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తయిన తర్వాత మూల్యాంకనం పూర్తయి కూడా ఇరవై రోజులు గడుస్తుంది.

ఆరు పరీక్షలు...
నిన్న ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన సబిత ఇంద్రారెడ్డి నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈసారి ఆరు పరీక్షలను మాత్రమే నిర్వహించిన ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయనుండటంతో లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News