నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరగనుంది.

Update: 2023-03-28 02:49 GMT

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరగనుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 32 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

రేపు ప్రతినిధుల సభ....
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో జరగనుంది. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ లో పార్టీ ప్రతినిధుల సభ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సభ జరగనుంది. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు హాజరుకానున్నారు.


Tags:    

Similar News