కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్.. లేటెస్ట్ రచ్చ ఏమిటంటే?

దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలు రిజెక్ట్

Update: 2023-09-25 09:50 GMT

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై. ఈ ఇద్దరు అభ్యర్థులు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయటానికి అర్హతలు అడ్డొస్తున్నాయని గవర్నర్ తమిళి సై వివరణ ఇచ్చారు. ఆర్టికల్ 171(5) ప్రకారం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యానారాయణ ఎంపిక జరగలేదని.. వీళ్లిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు, సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదంటూ గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేశారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) చెప్తోందని గవర్నర్ తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన దాసోజు, మాజీ ఎమ్మెల్యే కుర్రాలను ప్రతిపాదిస్తూ తెలంగాణ మంత్రి మండలి ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తాజాగా తిరస్కరించారు. వీరిద్దరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలను కూడా ఆమె చెప్పారు. ఇక గవర్నర్ నిర్ణయంపై బీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో!!


Tags:    

Similar News