Telangana : మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అరవై ఏళ్లు పైబడిన మహిళల కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో త్వరలో 60 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేకంగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల మంత్రి సీతక్క తెలిపారు.
వీరికి మాత్రమే...
ఇప్పటికే 60 ఏళ్ల లోపు మహిళలకు పొదుపు సంఘాలు ఉన్న విషయం తెలిసిందే. అలాగే 2026-27 ఆర్దిక సంవత్సరంలో కొత్త గా రెండు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రెండు పింఛన్లు పొందుతున్నవారిని, మరణించిన వారి పేర్లను తొలగిస్తున్నామని.. అర్హులకు ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు.