సచివాలయానికి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. ఆయన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించనున్నారు

Update: 2021-12-09 09:01 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. ఆయన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సచివాలయం నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతోనూ, కాంట్రాక్టర్లతోనూ ఆయన చర్చిస్తారు. సచివాలయానికి కేసీఆర్ వస్తుండటంతో ఆ ప్రాంతంలో భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

కొత్త భవనాల నిర్మాణం...
తెలంగాణలో ఐదు వందల కోట్లతో సచివాలయం నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. పాత భవనం కూల్చి వేసి కొత్త నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనుల పురోగతిని పరిశీలించేందుకు కేసీఆర్ సచివాలయానికి రానున్నారు.


Tags:    

Similar News