పనితీరు మెరుగుపరుచుకునే పనిలో పడ్డ ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 30-35 నియోజకవర్గాల్లోని అధికార పార్టీ శాసనసభ్యులు స్థానిక

Update: 2023-05-22 09:20 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్వహించిన సర్వేలో పేలవమైన మార్కులు పొందిన BRS ఎమ్మెల్యేలు తమ లోపాలను అధిగమించడం కోసం ప్రయత్నాలను ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు ప్రజలు, బీఆర్‌ఎస్‌ వర్గాలతో సరైన బాండింగ్ లేదని సీఎం కేసీఆర్ సర్వే వెలుగులోకి తెచ్చినట్లు సమాచారం. సర్వే వివరాలు.. సీఎం తీసుకున్న క్లాస్ తరువాత సదరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఎక్కువ సమయం గడుపుతున్నారని, ముఖ్యంగా బీఆర్ఎస్ మండల, గ్రామ స్థాయి నాయకులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 30-35 నియోజకవర్గాల్లోని అధికార పార్టీ శాసనసభ్యులు స్థానిక నాయకులకు దగ్గరయ్యే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు, మున్సిపల్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ల వంటి నాయకులు చాలా మంది ఎమ్మెల్యేలకు దూరం పాటిస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్యేలు అనవసరమైన వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే బాధతో వీరంతా ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటున్నారు. ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు తమదైన ప్రధాన బృందాన్ని మెయింటెయిన్ చేస్తున్నారని, దీనివల్ల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటున్నారు. ఇది పార్టీకి పెద్ద దెబ్బేనని ఆరోపిస్తున్నారు.
BRS నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు ఎమ్మెల్యేల వైఖరి కారణంగా 30-35 అసెంబ్లీ సెగ్మెంట్లలో క్యాడర్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలుస్తోందని.. మంత్రులు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు. 2014, 2018 తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ, కాంగ్రెస్‌ల నాయకులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉండడంతో అసంతృప్తి పెరిగిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పుకొచ్చారు. తమ పనితీరును మెరుగుపరుచుకుని, తదుపరి సర్వే నాటికి తిరిగి సీఎం దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తూ ఉన్నారు.


Tags:    

Similar News