Revanth Reddy : నేడు చెన్నైకు ముఖ్యమంత్రి రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చెన్నై కు వెళ్లనున్నారు

Update: 2025-09-25 03:41 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చెన్నై కు వెళ్లనున్నారు. తమిళనాడు ప్రభుత్వం చేపట్టనున్న మహావిద్యా చైతన్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నై బయలుదేరి వెళుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు.

మహా విద్య చైతన్య ఉత్సవాలలో...
తమిళనాడు ప్రభుత్వం మహా విద్య చైతన్య ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన కొందరికి మాత్రమే ఆహ్వానాలు పంపింది. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరు. ఈ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నై నుంచి ఈరోజు సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.


Tags:    

Similar News