Revanth Reddy : నేడు కూడా ఢిల్లీలోనే రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉండి హైకమాండ్ నేతలతో భేటీకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ హైకమాండ్ తో...
పార్టీలో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ పెద్దలకు వివరించే అవకాశముంది. అలాగే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికతో పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పనున్నారు. మరొకవైపు కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది.