కాంగ్రెస్ కు ఓటేస్తే వేస్ట్.. బీజేపీకి ఓటేస్తే ఇక అంతే
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు.
5న కేసీఆర్ సమావేశం.. పార్టీ ప్రకటనపై చర్చ
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన మునుగోడు ప్రజా దీవెన సభలో మాట్లాడుతూ కృష్ణా జిలాలను ట్రిబ్యునల్ కు రిఫర్ చేయమంటే కేంద్ర ప్రభుత్వం చేయడంల ేదన్నారు. మునుగోడులో బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అది వేస్ట్ అని ఆయన అన్నారు. మోదీ పార్టీకి ఓటేస్తే బావి కాడ మీటర్లు పెట్టినట్లేనని కేసీఆర్ హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఉంటేనే కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తానని తెలిపారు. బీజేపీకి మునుగోడులో ఎప్పుడూ డిపాజిట్లు రాలేదని అని ఆయన అన్నారు. అయితే ప్రజాదీవెన సభలో మునుగోడు అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించకుండానే ముగించారు. అలాగే ఎలాంటి వరాలు ప్రకటించలేదు. మరోసారి చుండూరులో సభకు వస్తానని ఆయన తెలిపారు.