హరీశ్ రావు డుమ్మా.. రీజన్ ఇదేనా?

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరు కాలేదు

Update: 2022-11-25 06:54 GMT

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరు కాలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఏపీ నుంచి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి హాజరయ్యారు.

రాష్ట్ర ఆదాయానికి....
అయితే ఈ సమావేశానికి మాత్రం తెలంగాణ మంత్రి హరీశ్ రావు దూరంగా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నలభై వేల కోట్ల నిధులను రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని స్వయంగా కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ సమావేశానికి హరీశ్ రావు దూరంగా ఉన్నారు.


Tags:    

Similar News