Revanth Reddy : అల్లుడిని అంబానీని.. బిడ్డను బిర్లాను చేయాలనుకున్నారు కానీ?
తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శిల్పకళావేదికలో నేడు జరిగిన గ్రూప్ 2 అభ్యర్థులకు ముఖ్యమంత్రి నియామకపత్రాలను అందచేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో పదేళ్లు పాలించిన పాలకులు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించలేదన్నారు. మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ నియామకాలను ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ది అని రేవంత్ రెడ్డి అన్నారు. నియామకాలు, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. అలాంటిది గత పాలకులు పూర్తిగా విస్మరించిందన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిందని అన్నారు.
అక్రమంగా సంపాదించిన సొమ్ముతో...
అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎక్కడికక్కడ అడ్డం పడుతున్నా తాము అనుకున్నది చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకులు అల్లుడిని అంబానీని, బిడ్డను బిర్లాను చేయాలనుకున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రయోజనాలను కూడా విస్మరించారని రేవంత్ రెడ్డి అన్నారు. అనేక చిక్కుముడులు వచ్చినా గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలు చేపట్టామని, గ్రూప్ 3 నియామకాలను కూడా త్వరలోనే చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.