నో..ఇక్కడ ఒమిక్రాన్ వేరియంట్ రాలేదు

తెలంగాణలోకి ఒమిక్రాన్ కేసులు రాలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

Update: 2021-12-11 06:53 GMT

తెలంగాణలోకి ఒమిక్రాన్ కేసులు రాలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారికి పరీక్షలు నిర్వహించిన అనంతరమే అనుమతిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతామని హరీశ్ రావు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో ఆయన సిటీ స్కాన్ యూనిట్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు.

విదేశాల నుంచి ...
విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని, అయితే వీరిలో ఎవరికీ ఒమిక్రాన్ వేరియంట్ సోకలేదని చెప్పారు. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హరీశ్ రావు తెలిపారు. గాంధీ వైద్యులు, సిబ్బంది కరోనా సమయంలో చేసిన సేవలను ఆయన కొనియాడారు.


Tags:    

Similar News