నేడు సీబీఐ ఎదుటకు అవినాష్ రెడ్డి

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఐదో సారి ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు

Update: 2023-04-19 03:14 GMT

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఐదో సారి ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు. అయితే హైకోర్టు మాత్రం ఈ నెల 25వ తేదీ వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ నిన్న ఆదేశించిన నేపథ్యంలో నేడు సీబీఐ అధికారుల ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుకానున్నారు.

ఆడియో, వీడియో...
ముందస్తు బెయిల్ రావడంతో ఈ నెల 25వ తేదీ వరకూ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం లేదు. 25వ తేదీన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఈ నేపథ్యంలో నేడు విచారణలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ సాగనుంది.


Tags:    

Similar News