రండి .. రండి.. ఇదే మంచి సమయమండి
బంగారం ధరలు దేశ వ్యాప్తంగా స్థిరంగా ఉంది. ఒక్క ముంబయిలోనే గ్రాముకు 31 రూపాయలు పెరిగింది.
బంగారం ధరలు దేశ వ్యాప్తంగా స్థిరంగా ఉంది. ఒక్క ముంబయిలోనే గ్రాముకు 31 రూపాయలు పెరిగింది. మిగిలిన చోట్ల బంగారం ధరలు పెరగలేదు. అందుకే బంగారం కొనుగోలు చేసే వారికి ఇది సరైన సమయం అని చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. రానున్న కాలంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉండనుంది. కరోనా థర్డ్ వేవ్ అని హెచ్చరికలు విన్పిస్తున్న సయమంలో బంగారం మరింత ప్రియం కానుంది.
హైదరాబాద్ లో ....
అందుకే ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేస్తు మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44,760 రూపాయలుగా ఉంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48,830 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.