అమ్మవారికి అగ్గిపెట్టెలో బంగారు చీర

ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గామల్లేశ్వర అమ్మవార్లకు ఓ భక్తుడు అగ్గిపెట్టిలో చీరను సమర్పించాడు

Update: 2023-04-11 04:56 GMT

ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గామల్లేశ్వర అమ్మవార్లకు ఓ భక్తుడు అగ్గిపెట్టిలో చీరను సమర్పించాడు. నలభై ఐదు వేల రూపాయలు ఖరీదు చేసే చీరను దుర్గమ్మకు కానుకగా ఇచ్చాడు. ఐదు గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండితో పూర్తి పట్టు దారాలతో నేసినట్లు నేత కార్మికుడు విజయ్ తెలిపారు.

నేత కార్మికుడు...
తెలంగాణలోని సిరిసిల్ల గ్రామం నుంచి వచ్చిన నేత కార్మికుడు విజయ్ అమ్మవారికి అగ్గిపెట్టి లో బంగారపు చీరను సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. 100 గ్రాముల బరువుతో నేసిన బంగారపు మరియు వెండి కలబోసి చీర అని విజయ తెిపాడు. చేనేత కళ మరుగున పడి పోకుండా, చేనేత కార్మికులు సురక్షింతంగా, సుఖవంతగాం ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు విజయ్ తెలిపారు.


Tags:    

Similar News