ఒకే అపార్ట్ మెంట్ లో పదిమందికి కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుంది. కరోనా కట్టడి అవుతుందనుకుంటున్న సమయంలో కేసులుపెరగడం ఆందోళన కల్గిస్తుంది

Update: 2021-12-05 01:15 GMT

తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుంది. కరోనా కట్టడి అవుతుందనుకుంటున్న సమయంలో ఒక్కసారి కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తుంది. హైదరాబాద్ లోని ఒక అపార్ట్ మెంట్ లో పది మందికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈరోజు అపార్ట్ మెంట్ వాసులందరికీ ర్యాపిడ్ టెస్ట్ లు చేయనున్నారు.

ఢిల్లీకి వెళ్లి వచ్చిన...
రాజేంద్రనగర్ లోని పీరం చెరువు సమీపలంలో ఒక అపార్ట్ మెంట్ లో పది మందికి కరోనాగా నిర్ధారణ అయింది. ఇటీవల ఆ అపార్ట్ మెంట్ లో ఒక వ్యక్తి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఆయన నుంచే కరోనా వ్యాప్తి చెందిందని మిగిలిన వారు అనుమానిస్తున్నారు. పదిమందికి ఒకేసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. అపార్ట్ మెంట్ మొత్తాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటైజ్ చేశారు.


Tags:    

Similar News