Medigadda: మేడిగడ్డకు బయలుదేరిన ఎమ్మెల్యేలు

అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు

Update: 2024-02-13 06:16 GMT

అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక బస్సుల్లో వారు అసెంబ్లీ ప్రాంగణం నుంచి బస్సుల్లో వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. రోడ్డు మార్గాన వీరు బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకోనున్నారు.

బ్యారేజీని సందర్శించి....
అక్కడ దాదాపు రెండు గంటల పాటు ఉంటారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించడమే కాకుండా, మేడిగడ్డపై ఎమ్మెల్యేలకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తారు. దీంతో మేడిగడ్డ బ్యారేజీ పరిసర ప్రాంతాల్ల రాకకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ సందర్శనకు ఎంఐఎం, సీపీఐ సభ్యులు వెళ్లగా, బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు దూరంగా ఉన్నారు. తిరిగి రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాద్ కు ఈ బృందం చేరుకోనుంది.


Tags:    

Similar News