మోదీకి కేసీఆర్ లేఖ

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాల్లో పెట్టాల్సిన బిల్లులపై లేఖలో పేర్కొన్నారు.

Update: 2023-09-15 12:09 GMT

ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాల్లో పెట్టాల్సిన బిల్లులపై తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఉభయ సభ సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

రిజర్వేషన్ బిల్లుపై...
అనంతరం ఈ నెల 18 నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మహిళ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కోరారు. అన్ని పార్టీలూ ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతాయని తెలిపారు. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కూడా పార్లమెంటులో పెట్టి ఆమోదించాలని కోరారు. గతంలోనే ఈ బిల్లులను తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి ఆమోదించిందన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.


Tags:    

Similar News