తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.8 లక్షల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

Update: 2022-08-11 08:15 GMT

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎనిమిది లక్షల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రబీ సీజన్ లో ఈ ధాన్యం సేకరణను జరపనన్నట్లు తెలిపింది. ఇప్పటికే 6.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ నుంచి సేకరించిన కేంద్ర ప్రభుత్వం మరో ఎనిమిది లక్షల టన్నుల సేకరణకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ అందింది.

ప్రభుత్వం రాసిన లేఖకు...
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో ఉప్పుుడు బియ్యం సేకరణ సాఫీగా సాగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. కేంద్రం నిర్ణయాన్ని మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. రైతుల కష్టాలను తెలుసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.


Tags:    

Similar News