Telangana : నేటి నుంచి ప్రజాపాలన
తెలంగాణలో ఆరు గ్యారంటీలను పొందడానికి నేటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
praja palana
తెలంగాణలో ఆరు గ్యారంటీలను పొందడానికి నేటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు జరగనున్నాయి. ఈ గ్రామ సభల్లో సంక్షేమ పథకాలను సొంతం చేసుకునేందుకు అవసరమైన దరఖాస్తును నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. గ్రామసభల్లో ఆ దరఖాస్తును అందచేయాల్సి ఉంటుంది.
గ్రామసభల్లో...
గ్రామసభలను నిర్వహించడం కోసం ప్రతి జిల్లాలోనూ ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. గ్రామ, మండల, వార్డు, పట్టణ, నగర కార్పొరేషన్ పరిధుల్లో ఈ గ్రామ సభల జరగనున్నాయి. ప్రజాపాలన అని దీనికి నామకరణం చేశారు. అబ్దుల్లాపూర్మెట్ లో జరగనున్న గ్రామసభలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి ివిక్రమార్క పాల్గొంటారు. అలాగే ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ ఈ గ్రామసభల్లో పాల్గొనాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.