17న కాంగ్రెస్‌ బహిరంగ సభ.. ఐదు కీలక హామీలను ప్రకటించనున్న సోనియా

తెలంగాణ వచ్చేది కాంగ్రెస్సేనని, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలని, అందరు సమన్వయంతో మెలగాలని కాంగ్రెస్‌..

Update: 2023-09-07 05:57 GMT

తెలంగాణ వచ్చేది కాంగ్రెస్సేనని, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలని, అందరు సమన్వయంతో మెలగాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ సూచిచారు. బుధవారం రాత్రి తాజ్‌కృష్ణా హోటల్‌లోని రేవంత్ రెడ్డి, మాణిక్‌రావ్‌ ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలకు పలు సూచనలు, సలహాలు చేశారు. రాత్రి 10 గంటల దాకా జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 16వ తేదిన నిర్వహించనున్న సీడబ్య్లూసీ సమావేశాన్ని.. 17వ తేదిన జరిగే బహిరంగ సభలపై కూడా కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. అలాగే సీడబ్య్లూసీ సమావేశానికి పార్టీ జాతీయ నేతలందరు హాజరవుతున్న తరుణంలో దీన్ని సవాల్‌గా తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలతో సహా పలువురు నేతలు రానున్నారని అన్నారు. వీళ్లు 16,17వ తేదీల్లో హైదరాబాద్‌లోనే ఉంటారని, సభ నిర్వహణకు పార్టీ నేతలతో ఆహార, రవాణా, సమన్వయ తదితర కమిటీలను ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే వీటికి నేతలు మధుయాస్కీ, మహేష్ గౌడ్ తదితరులు నాయకత్వం వహించాలని సూచించారు. సభకు ప్రతి మండలం నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలు వచ్చేలా ప్లాన్‌ చేయాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే..5 హమీలపై గ్యారంటీ పత్రాన్ని బహిరంగ సభలో సోనియా గాంధీ విడుదల చేస్తారని అన్నారు. ఈ గ్యారంటీ హామీలను, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు చేయాలని సూచించారు. అందరి ఐక్యతతో విజయం సాధించవచ్చని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
అలాగే సెప్టెంబర్ 18న పార్టీ జాతీయ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని, ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తారని అన్నారు. మరోవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా తాజ్‌కృష్ణ హోటల్‌లో.. వేణుగోపాల్, రేవంత్ సహా తదితర నేతలతో చర్చలు జరిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే వామపక్షాలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈనెల 17న నిర్వహించనున్న బహిరంగ సభ కోసం మైదానం ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే సభకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ ఇవ్వాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు చేసుకుంది తెలంగాణ కాంగ్రెస్‌. కానీ అదే రోజున బీజేపీ కార్యక్రమం ఉండటం వల్ల తమకు ఇస్తారో.. లేదోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చివరికి ఎల్బీ స్టేడియంలో సభను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే తుక్కుగూడలో సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారని, అయితే ఎక్కడ నిర్వహంచాలేది గురువారం నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు పేర్కొన్నారు.
Tags:    

Similar News