అటు ఉక్రెయిన్ యుద్ధం... ఇటు పెంపుడు జాగ్వార్, చిరుతలు.. ఏపీ డాక్డర్ ఏం చేశాడంటే?

అతడు తాను పెంచుకొంటున్న జాగ్వార్, చిరుతలు వదిలిపెట్టలేకపోయాడు. చాలా రోజుల పాటూ బేస్ మెంట్ లోనే వాటిని చూసుకుంటూ వచ్చిన అతడు

Update: 2022-10-02 12:16 GMT

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత ఎంతో మంది జీవితాలు తారుమారయ్యాయి. ఇక మూగ జీవుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది తాము పెంచుకుంటున్న జంతువులను తీసుకుని వెళ్లడానికి చాలా ఇబ్బందులే పడ్డారు. ఇంకొంత మంది వాటిని వదిలేసి వెళ్లిపోయారు. అయితే కొందరు మాత్రం వాటి కోసం ఏమి చేయడానికైనా సిద్ధమని చెప్పారు.

అయితే భారత్ కు చెందిన ఓ డాక్టర్.. ఉక్రెయిన్ లోనే ఉండిపోయాడు. అతడు తాను పెంచుకొంటున్న జాగ్వార్, చిరుతలు వదిలిపెట్టలేకపోయాడు. చాలా రోజుల పాటూ బేస్ మెంట్ లోనే వాటిని చూసుకుంటూ వచ్చిన అతడు.. తాజాగా తన పెంపుడు జంతువులకు దూరమవ్వాల్సి వచ్చింది. గిరి కుమార్ పాటిల్ ఏది ఏమైనా కానీ తన 
జాగ్వార్, చిరుత
 విడిచిపెట్టకూడదని అనుకున్నాడు. అతను తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతంలో ఉన్న సెవెరోడోనెట్స్క్‌లోని ఒక చిన్న పట్టణంలోని స్వవ్‌టోవ్‌లోని ఒక ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా పని చేస్తూ ఉన్నాడు. 2016 నుండి ఉక్రెయిన్ పౌరుడిగా ఉన్న 42 ఏళ్ల పాటిల్, రెండేళ్ల క్రితం రాజధాని కైవ్‌లోని జూ నుండి ఈ జంతువులను కొనుగోలు చేశారు. 24 నెలల వయస్సు గల "లెప్జాగ్", ఇది మగ చిరుత- ఆడ జాగ్వార్‌ల హైబ్రిడ్, ఆడ నల్ల చిరుత(జాగ్వార్) 14 నెలల వయస్సు ఉంటుంది.
రెండు వారాల క్రితం పాటిల్ దగ్గర డబ్బు అయిపోయింది. తన పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం కోసం పోలాండ్‌కి వెళ్లాడు. అతను పనిచేసిన ఆసుపత్రి యుద్ధం ప్రారంభంలో మూసివేయబడింది. ఇప్పుడు బాంబు దాడిలో ధ్వంసమైంది. పాటిల్ ఇతర ఉక్రేనియన్ శరణార్థులతో కలిసి వార్సాలోని హాస్టల్‌లో వసతి గృహంలో నివసిస్తున్నాడు. జీవనోపాధి కోసం చూస్తున్నాడు. తన పెంపుడు జంతువులు ఏమైపోయాయో అని ఎంతో భయంతో ఉన్నాడు.
స్వవ్‌టోవ్‌లో ఓ రైతు దగ్గర తన 
పెద్ద
 పిల్లులను ఉంచేసి.. వెళ్లిన పాటిల్.. ఇప్పుడు ఆ జాగ్వార్, చిరుత బాగోగుల గురించి తెలుసుకోవాలని ఆ రైతుకు కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వలేదు. రెండు వారాల క్రితం స్వవ్‌టోవ్‌లోని ఇంటర్నెట్ ఆగిపోయిందని తెలిసింది. తన అటు ఉక్రెయిన్ యుద్ధం... ఇటు పెంపుడు జాగ్వార్, చిరుతలు.. ఏపీ డాక్డర్ ఏం చేశాడంటే? చూసుకుంటున్న స్థానిక రైతుకు ఫోన్ చేస్తూ వాటి గురించి ప్రతిరోజూ తెలుసుకుంటూ ఉంటున్నానని తెలిపాడు. జంతువులు నన్ను మిస్ అవుతున్నాయని సంరక్షకుడు నాకు చెప్పాడు. దాదాపు వారం రోజులుగా 'లెప్‌జాగ్' సరిగా తినలేదు. బ్లాక్ పాంథర్ 
కు ఏమి జరుగుతోందో కూడా అర్థం అవ్వలేదని చెప్పాడని పాటిల్ తెలిపాడు.

తన పెంపుడు జంతువుల కోసం వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని, రెండు అపార్ట్‌మెంట్‌లు, రెండు కార్లు, మోటార్‌సైకిల్, కెమెరాను $100,000 (£89,908) అమ్మేశాడు. యుద్ధం ప్రారంభమైన తర్వాత, అతను తన తన పెంపుడు జంతువులకు 5 కిలోల మాంసం (ఎక్కువగా కోడి మాంసం) ప్రతిరోజు తినిపించడానికి $300 వరకు ఖర్చు చేసాడు. అతడి దగ్గర డబ్బు అయిపోవడంతో.. తన పెంపుడు జంతువుల
ను సంరక్షకుని వద్ద వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు. సరిహద్దు దాటి, కొంత డబ్బు సంపాదించి తిరిగి వచ్చానని తెలిపాడు. తన పిల్లుల కోసం ఫ్రీజర్‌లో మూడు నెలలకు సరిపోయేంత ఆహారాన్ని ఉంచానని, కేర్‌టేకర్‌కు మూడు నెలల వేతనంగా $2,400 చెల్లించానని చెప్పాడు.
అలా బోర్డర్ దాటిన అతడిని రష్యన్ ఆర్మీ చుట్టుముట్టింది. ఎంతో ఇంటరాగేషన్ తర్వాత అతడికి ఒక పేపర్ ఇచ్చి పంపించారు. తనకు యుద్ధంలో ఎవరితోనూ సంబంధం లేదని రష్యన్ లకు చెప్పడమే కాకుండా.. తనకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలను కూడా వారికి చూపించడం చాలా మంచిదైంది. దాదాపు 60,000 మంది ఫాలోవర్స్ ఉన్న యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నానని.. తన జంతువులతో ఇంట్లో చిక్కుకుపోయానని గిరి వారికి చెప్పాడు. ఒక రష్యన్ అధికారి నా దగ్గరకు వచ్చి, అతని భార్య నా వీడియోలను చూసిందని.. చెప్పి వెళ్లిపోమని అనడంతో బయట పడ్డాడు. మూడు రోజులు వారి దగ్గర ఉంచుకున్న తర్వాత పంపించారు.
మరుసటి ఉదయం.. వారు అతన్ని విడిపించారు. అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని.. అతనికి గుర్తింపు లేఖ ఇచ్చారని పాటిల్ తెలిపాడు. అతనిని పోలిష్ సరిహద్దు దగ్గర ఉంచారు. అతని బయోమెట్రిక్‌లను తీసుకున్నారు. పోలిష్ అధికారులు అతనికి "పేపర్ వీసా" ఇచ్చారు. 90 రోజుల పాటు దేశంలో ఉండడానికి వీలు కల్పిస్తుందని అతను చెప్పాడు. తన పిల్లులు ఉన్న ప్రాంతంలో పరిస్థితి మరింత దిగజారుతుండడంతో వాటి గురించి బాధపడుతూ ఉన్నానని తెలిపాడు. అతని కుటుంబం ఆంధ్రప్రదేశ్‌ లో ఉంటున్నారు. అతడికి డబ్బులు పంపుతున్నారు. కొన్ని సార్లు కైవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఫోన్ లో సంప్రదించాను.. అడవి జంతువులను తీసుకుని రావడానికి తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని చెప్పడంతో నిరాశ చెందుతున్నాడు గిరి. వార్సాలోని జంతుప్రదర్శనశాల నిర్వాహకులను కూడా సహాయం కోరినట్లు చెప్పాడు. భారత ప్రభుత్వం సహాయం చేసి, వాటిని రక్షించాలని కోరుకుంటూ ఉన్నానని గిరి కోరుతున్నాడు.


Tags:    

Similar News