ప్రశాంత్ కిషోర్.. దారెటు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇకపై తెలుగుదేశం పార్టీకి వ్యూహాలు రచించబోతున్నారని
AP Politics
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇకపై తెలుగుదేశం పార్టీకి వ్యూహాలు రచించబోతున్నారని తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానశ్రయంలో ప్రత్యక్ష మయ్యారు. వినాశ్రయం నుంచి బయటకు వచ్చిన పీకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాహనంలో విజయవాడ బయలుదేరారు. లోకేశ్తో పాటు ఒకరిద్దరు తెలుగుదేశం నేతలు కూడా ప్రశాంత్ కిషోర్ను కలిసి వెళ్లారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. కొంతకాలం తెలంగాణలో కేసీఆర్ కోసం పనిచేసినా తర్వాత ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఊహించని విధంగా ప్రశాంత్ కిషోర్ టీడీపీ చెంత చేరారు. ఇప్పటి వరకూ టీడీపీ తరఫున రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను నియమిస్తారో లేదో అనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.