కేదార్ నాథ్ లో మంచు బీభత్సం

ఇటీవల కాలంలో సంభవించిన హిమపాతంలో ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. కానీ.. ఈ సంఘటనకు..

Update: 2023-06-09 04:24 GMT

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ దేవాలయం చుట్టుపక్కల ఉన్న పర్వతాలపై గురువారం భారీ హిమపాతం సంభవించింది, ఇది 2013లో సంభవించిన విషాద సంఘటనను గుర్తు చేసింది. అప్పట్లో జరిగిన హిమపాతం సుమారు 6,000 మంది ప్రాణాలను బలిగొంది. ఇటీవల కాలంలో సంభవించిన హిమపాతంలో ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. కానీ.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాత్రికులు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో బంధించి నెట్టింట్లో పోస్ట్ చేశారు.

వీడియో క్లిప్‌లో పర్వతాల నుండి మంచు కురుస్తున్న దృశ్యాన్ని చూపిస్తుంది. యాత్రికులు, సందర్శకులు ఆలయం ముందు మంచు కురుస్తున్న దృశ్యాన్ని చూస్తున్నారు. హిమపాతం కారణంగా.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే భక్తులను అప్రమత్తం చేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే ప్రయాణం చేయాలని హెచ్చరించింది. ప్రయాణికులు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాలలో పార్క్ చేయాలని సూచించింది. వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.


Tags:    

Similar News