జమ్మూ శ్రీనగర్ హైవేపై నిలిచిన వాహనాలు

జమ్మూ- శ్రీనగర్ హైవేపై వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి

Update: 2026-04-06 05:43 GMT

జమ్మూ- శ్రీనగర్ హైవేపై వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బురద, మట్టి రహదారిపై పేరుకుపోయింది.

కొండచరియలు విరిగిపడటంతో...
దీంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. సహాయక బృందాలు రహదారిపై పడిన మట్టిని, బురదను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో గంటల సేపు ప్రయాణ సమయం పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







Tags:    

Similar News